
గుంటూరు
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025
వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలో సంక్షేమ పథకాల కింద అందించిన మొత్తం వివరాలు..
నేడు వల్లభేశ్వరుడి వార్షికోత్సవం
రొంపిచర్ల: మండలంలోని విప్పర్లలో గల వల్లభేశ్వరస్వామి ఆలయ ఏడో వార్షికోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి విశేష పూజలు, హోమాలు జరుగుతాయి.
అలరించిన వేణుగాన కచేరీ
నగరంపాలెం: బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం వల్లూరు కృష్ణకిషోర్, ఆర్.శశాంక్, జనార్దన్ల వేణుగాన కచేరీ అలరించింది.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 512.30 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 5,598 క్యూసెక్కులు విడుదలవుతోంది.
కూటమి పాలన సంక్షోభం వైపు వెళ్తోంది. గత ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందాయి. తర్వాత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి.. సంక్షేమం మాటే మరిచిపోయింది. పింఛను నామమాత్రంగా పెంచి, ఉన్న లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించడం మినహా ఒక్క పథకాన్నీ అమలు చేయలేదు. సరికదా.. ఇప్పటికే ఉన్న అన్ని పథకాలకూ తిలోదకాలు ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, రెడ్బుక్ రాజ్యాంగం అమలు, సామాన్యులపై దౌర్జన్యాలు చేయడంపైనే పాలకులు దృష్టి పెట్టారు. ప్రజా సంక్షేమం గాలికొదిలేశారు.
7
న్యూస్రీల్

గుంటూరు

గుంటూరు

గుంటూరు