గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Apr 27 2025 1:59 AM | Updated on Apr 27 2025 1:59 AM

గుంటూ

గుంటూరు

ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

I

ప్రిన్సిపల్‌ జడ్జిని కలిసిన కలెక్టర్‌

నరసరావుపేట: స్థానిక కోర్టు ప్రాంగణానికి శనివారం విచ్చేసిన గుంటూరు జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి సాయికల్యాణ చక్రవర్తిని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు మర్యాద పూర్వకంగా కలిశారు.

తెనాలి: దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మేధోవికాసానికి గ్రంథాలయాలు తోడ్పడతాయి. గ్రంథాలయోద్యమం స్వాతంత్య్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకం. ప్రస్తుతం అనేక కారణాలతో గ్రంథాలయ వ్యవస్థ ఆదరణ కోల్పోతోంది. దీనిని పునరుజ్జీవింపజేయడం ప్రభుత్వ బాధ్యత. సంరక్షించుకోవటం ప్రజల బాధ్యత. ఈ నినాదంతోనే ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఉద్యమ రాష్ట్ర సదస్సు ఈనెల 27న విజయవాడ గవర్నర్‌పేట లోని ఎంబీ విజ్ఞానకేంద్రంలో జరగనుంది. ఈ సందర్భంగా విజయవాడ కేంద్రంగా జరిగిన గ్రంథాలయ ఉద్యమం, చరిత్రను తెలుసుకుందాం.

1914లోనే అంకురార్పణ

గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య సారథ్యంలో 1914లో ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం ఏర్పడింది. అప్పట్లో రాష్ట్రంలో 200 గ్రంథాలయాలు నడుస్తుండేవి. ఏప్రిల్‌ 11, 12 తేదీల్లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాజన సభకు రాష్ట్రంలోని 60 గ్రంథాలయాల నుంచి 200 మందికి పైగా హాజరయ్యారు. సభాధ్యక్షుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం, మోచర్ల రామచంద్రరావు అధ్యక్షులుగా అయ్యంకి వెంకటరమణయ్య, నాళం కృష్ణారావు కార్యదర్శులుగా ఆంధ్ర దేశ గ్రంథ భాండాగార సంఘం ఏర్పడింది. ఇదే సంఘం 1916లో ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘంగా, 1956 నుంచి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘంగా రూపుదిద్దుకుంది. గ్రంథాలయాల ఆవశ్యతకపై ఊరూరా సభలు, చర్చలు జరిపారు. యువకులు వందలాది గ్రంథాలయాలను స్థాపించారు. మరోవైపు సభలు, సమావేశాలు, యాత్రలతో 1920 నాటికి వందల సంఖ్యలో గ్రంథాలయాలు వెలిశాయి.

మూడంచెల వ్యవస్థగా..

క్రమబద్ధమైన గ్రంథాలయ వ్యవస్థ నిర్వహణకు తగిన చట్టం కోసమని ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం 1948 జనవరి 16న విజయవాడలో మహాసభ జరిపింది. గాడిచర్ల హరిసర్వోత్తమరావు అధ్యక్షుడు. 1950 నుంచి ఆంధ్రప్రాంతంలో మద్రాస్‌ పౌర గ్రంథాలయ చట్టం అమల్లోకి వచ్చింది. ఇదే నమూనాలో 1955లో హైదరాబాద్‌ పౌర గ్రంథాలయ చట్టం, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక 1960 నుంచి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ చట్టం ఆమోదం పొందింది. మూడంచెల గ్రంథాలయ వ్యవస్థ అంటే ప్రభుత్వ గ్రంథాలయాలు, జిల్లా గ్రంథాలయ సంస్థల గ్రంథాలయాలు, స్థానిక సంస్థల, ఇతర స్వచ్ఛంద గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. వీటి నిర్వహణకు జిల్లా గ్రంథాలయ సంస్థలు వచ్చాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయాలు, 5వేల జనాభాకు మించిన పట్టణాల్లో, గ్రామాల్లో వీలున్నంతవరకు శాఖా గ్రంథాలయాలు నెలకొల్పారు. వెయ్యి జనాభాకు పైబడిన గ్రామాల్లో పుస్తక పంపిణీ కేంద్రాలను తీసుకొచ్చారు. 2011–12 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 22 జిల్లా కేంద్ర గ్రంథాలయాలు, ఒక నగర కేంద్ర గ్రంథాలయం, 1450 శాఖా గ్రంథాలయాలు, 400 గ్రామీణ గ్రంథాలయాలు, 600 పుస్తక పంపిణీ కేద్రాలు పనిచేస్తున్నాయి. తర్వాత కొన్ని మండలాల్లో 634 శాఖాగ్రంథాలయాలు, ప్రతి జిల్లాకు మూడు చొప్పున మరో 69 గ్రంథాలయాలను స్థాపించారు.

నేడు నామమాత్రం

గ్రంథాలయ చట్టం ప్రకారం మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజల్నుంచి వసూలుచేసే ఇంటిపన్నులో రూపాయికి ఎనిమిది పైసలు వంతున సెస్సు రూపంలో వసూలుచేసి గ్రంథాలయ నిధికి ఇవ్వాలి. ఈ నిధి నుంచే జిల్లా గ్రంథాలయ సంస్థలు తమ అధీనంలోని గ్రంథాలయాలను నిర్వహిస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్ధతిలో పూర్తికాలపు సిబ్బంది జీతభత్యాలను భరిస్తుంది. 1975 నుంచి వచ్చిన ఈ మార్పుతో జిల్లా గ్రంథాలయ సంస్థలు కాస్త స్థిరపడ్డాయి. అయితే 1986 తర్వాత శాఖాగ్రంథాలయాల స్థాప న జరగలేదు. స్థానిక సంస్థలు సెస్సు జమచేయకపోవటం, ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యం, కొత్త పుస్తకాలు లేక, పఠనం తగ్గిపోవటంతో గ్రంథాలయాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి.

అల వైకుంఠపురంలో...

శ్రీవారి ఆదాయానికి గండి

న్యూస్‌రీల్‌

గ్రంథాలయోద్యమ స్ఫూర్తికి నేడు తూట్లు

నాడు విజయవాడ కేంద్రంగా గ్రంథాలయ ఉద్యమం ఆ స్ఫూర్తితో ఊరూరా వెలిసిన గ్రంథాలయాలు స్వాతంత్య్రానంతరం తగ్గిన ప్రాభవం.. నేడు మరీ తీసికట్టు నేడు ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ రాష్ట్ర సదస్సు

బోటు గ్రంథాలయాలు

గ్రంథాలయాలను పరిరక్షించుకోవాలి

సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, మానసిక వికాసానికి తోడ్పడుతున్న గ్రంథాలయాలు

కనీస సౌకర్యాలు లేక దీనావస్థలో ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాలి. దక్షిణాదిలోని రాష్ట్రాలు గ్రంథాలయాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంటే, తెలుగు రాష్ట్రాల్లో అందుకు భిన్నంగా జీర్ణావస్థలో ఉన్నాయి. కర్ణాటకలో ఆరువేల గ్రంథాలయాలుంటే, ఇటీవల మరో నాలుగువేల గ్రంథాలయాలను ప్రారంభించారు. గ్రంథాలయాలకు రూ.2 లక్షల చొప్పున పుస్తకాలకు కేటాయించారు. 47 లక్షలమంది పిల్లలను సభ్యులుగా చేర్చారు. పాఠశాలల్లో పిల్లలు పుస్తకాల చదువుకు ప్రత్యేకంగా గంట కేటాయించారు. మన రాష్ట్రంలో ఉన్నవి కేవలం 1400 మాత్రమే. అవికూడా దీనావస్థలో ఉన్నాయి.

– వల్లూరు శివప్రసాద్‌,

ఉద్యమ వేదిక కన్వీనర్‌

గ్రంథాలయ వ్యవస్థలోని యువజనులకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆర్థికసాయంతో 1920లో విజయవాడలో శిక్షణ శిబిరం నిర్వహించింది. కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, వేమవరపు రామదాసు పంతులు, చిలుకూరు వీరభద్రరావు, రాయప్రోలు సుబ్బారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, సూరి వెంకటనరసింహం తదితరులు అధ్యాపకులుగా వ్యవహరించారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో శిక్షణ తరగతులు జరిపారు. వీటిలో బోటు యాత్రలూ ఉన్నాయి. ఇది స్ఫూర్తిగా పాతూరి నాగభూషణం తెనాలి తాలూకాలోని పెదపాలెం సేవాశ్రమ వాణీమందిరం తరఫున 1935లో బకింగ్‌హాం కెనాల్‌ బ్రాంచి కాల్వపై కొంతకాలం బోటు గ్రంథాలయం నడిపారు. పెదవడ్లపూడి – కొల్లూరు మధ్య, వడ్లపూడి – పిడపర్రు మధ్య, సంగంజాగర్లమూడిలో మద్రాస్‌ కాల్వపై బోటు గ్రంథాలయం నిర్వహించారు. మద్రారస్‌ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ వీఎన్‌ శివసామయ్యర్‌, స్థానిక సంస్థలు స్వయంగా గ్రంథాలయాలను ప్రారంభించటం, తమ నిధుల నుంచి రిజిస్టరై స్వచ్ఛందంగా నిర్వహించే గ్రంథాలయాలకు గ్రాంటు మంజూరుకు అవకాశం కల్పించారు.

గుంటూరు1
1/10

గుంటూరు

గుంటూరు2
2/10

గుంటూరు

గుంటూరు3
3/10

గుంటూరు

గుంటూరు4
4/10

గుంటూరు

గుంటూరు5
5/10

గుంటూరు

గుంటూరు6
6/10

గుంటూరు

గుంటూరు7
7/10

గుంటూరు

గుంటూరు8
8/10

గుంటూరు

గుంటూరు9
9/10

గుంటూరు

గుంటూరు10
10/10

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement