టెన్షన్‌ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువు | High blood pressure hypertensionis a silent killer | Sakshi
Sakshi News home page

BP టెన్షన్‌ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువు

May 23 2026 12:04 PM | Updated on May 23 2026 12:11 PM

High blood pressure hypertensionis a silent killer

దేశంలో అంటువ్యాధుల కంటే జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల తీవ్రత పెరిగి΄ోతోంది. అందులో హైపర్‌ టెన్షన్‌ ఒకటి. నిశ్శబ్దంగా చుట్టుముట్టి.. గుండెను బలహీనపరిచే ఈ హైపర్‌ టెన్షన్‌ కంటికి కనిపించని ఒక శత్రువు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి నివేదికల ప్రకారం.. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతోంది. 

  • భారత్‌లో సుమారు 30% మంది (దాదాపు 21.20 కోట్ల మంది) అధిక రక్తపోటుతో సతమతమవుతున్నారు. అంటే ప్రతి నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది దీని బారిన పడ్డారు.

  • గతంలో  50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే ఈ సమస్య, ఇప్పుడు 25–30 ఏళ్ల యువతలోనూ అధికంగా కనిపిస్తోంది. 

  • అధ్యయనాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాలతో (10–15%) పోలిస్తే, పట్టణ  ప్రాంతాలలో (25%) అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా ఉంది. 

  • పురుషుల్లో రక్తపోటు నియంత్రణ 13% మాత్రమే ఉండగా, మహిళల్లో ఇది 22% గా నమోదైంది. 

  • భారతదేశంలో గుండె జబ్బులకు, మరణాలకు అధిక రక్తపోటు ఒక ప్రధాన కారణంగా ఉంది, దీనివల్ల ఏటా సుమారు 16 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ∙సుమారుగా ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే తక్కువ మంది చికిత్స పొందుతున్నారు.

 

ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస‍్టల్స్‌, కాన్స్‌ క్వీన్‌ ఐశ్వర్య లుక్‌ స్పెషాల్టీ!

ప్రపంచవ్యాప్తంగా..
 

  • 30–79 ఏళ్ల మధ్య ఉన్న వారిలో సుమారు 140 కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. అంటే 33 శాతం మంది. 

  • వీరిలో దాదాపు 60 కోట్ల మందికి (44%) అసలు తమకు ఈ సమస్య ఉందనే  విషయమే తెలియదు.

  • కేవలం 44% మంది మాత్రమే వ్యాధిని గుర్తించి చికిత్స  పొందదుతున్నారు. 

  • చికిత్స పొందుతున్న వారిలో కేవలం 23%  (320 మిలియన్లు) మంది మాత్రమే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement