భారీ వృక్షాలను ఇష్టానుసారంగా నరికి, కలపను అమ్ముకుంటున్నారని ఐదు రోజుల క్రితం పీఐపీఆర్ఎంసీ ఏఈ బాపూజీకి ఫిర్యాదు చేశాను. ఘటనా స్థలానికి వచ్చిన ఆయన పొయ్యిలోకి పుల్లలు నరుక్కుంటున్నారట అని నాతో చెప్పారు. అలాగైతే మెషీన్లతో పెద్దపెద్ద చెట్లను నరకాల్సిన పనేముందని అన్నాను. దానికి ఆయన నరికిన కలపను ట్రాక్టర్లలో తరలించేటప్పుడు పట్టుకుని, మాకు అప్పగిస్తే సీజ్ చేస్తామని అన్నారు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తానంటే.. రెండు రోజుల్లో చెట్లు నరికే వ్యక్తిని పట్టుకుంటామన్నారు. కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. డీఈకి కూడా వాట్సాప్లో ఫొటోలు పంపాము. ఏ స్పందన లేదు. మరీ ఇంత దారుణమా.
– మద్దిపాటి సుధీర్, ఎం.నాగులపల్లి, ద్వారకాతిరుమల మండలం


