తాడేపల్లిగూడెం: మూడు రోజుల పాటు ఉద్యాన వర్సిటీ వెంకట్రామన్నగూడెంలో జరిగిన 12వ అంతర్ కళాశాలల పోటీల్లో వెంకట్రామన్నగూడెం జట్లు ఓవరాల్ చాంపియన్గా నిలిచాయి. రిలే పోటీలు, బాస్కెట్బాల్, కబడ్డీ, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటి అన్ని పోటీల్లో అత్యుత్తమ కనపర్చిన వీఆర్గూడెం ఉద్యాన కళాశాల జట్లు విజయకేతనం ఎగురవేశాయి. ఆదివారం రాత్రి ముగింపు సందర్బంగా ట్రోఫీలను ఉద్యానవర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు, రిజిస్ట్రార్ ఎం.మాధవి, డాక్టర్ చలపతిరావు తదితరులు అందజేశారు.


