భీమవరం: నెట్బాల్ జూనియర్ బాల బాలికలు, సీనియర్ పురుషులు, మహిళల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారుల ఎంపిక భీమవరంలో శనివారం సీఎస్ఎన్ కళాశాలలో నిర్వహించారు. జూనియర్ బాలికల జట్టుకు పి.మానస, పి.అజగవ, ఐ.కీర్తన, ఎ.సంజన, కె.సంజు, జి.లిఖిత, కె.మౌనిక, కె.రాము ఎంపికయ్యారు. మహిళల జట్టుకు కె.భారతి, పి.అక్షయ, జి.శ్రావణి, బాలురు జట్టుకు డి.ఫణింద్ర కుమార్, కె.బాలసాయి రామకృష్ణ, బి.రాజేష్, కె.హనుక్, టి.కేశవ మణికంఠ ఎంపికయ్యారు. పురుషులు జట్టుకు డి.బాల సత్య, జీఎన్వీఎస్ విజయ్ కుమార్ ఎంపికై నట్లు జిల్లా నెట్బాల్ సంఘ కార్యదర్శి పి.దావూద్ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండి సలీం ఖాన్, స్కూల్ ప్రిన్సిపాల్ నిర్మలాదేవి, నెట్బాల్ సంఘ సభ్యులు ఎన్.విజయలక్ష్మి, పి.శ్రీనివాస్, జీఎన్వీఎస్ విజయకుమార్ పాల్గొన్నారు.


