తవ్వేద్దాం.. దోచేద్దాం | - | Sakshi
Sakshi News home page

తవ్వేద్దాం.. దోచేద్దాం

Jan 7 2026 7:41 AM | Updated on Jan 7 2026 7:41 AM

తవ్వే

తవ్వేద్దాం.. దోచేద్దాం

బ్రో.. రెడ్‌ సిగ్నల్‌ పడింది అనుమతులు లేవు అటవీ శాఖకు 13 కొత్త వాహనాలు 11న ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సైకిల్‌ యాత్ర యూరియా కోసం ఇబ్బంది పెడితే కేసులే యువకుడిపై హత్యాయత్నం సంరకాంతికి ప్రత్యేక రైళ్ళు

న్యూస్‌రీల్‌

అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

బ్రో.. రెడ్‌ సిగ్నల్‌ పడింది
ట్రాఫిక్‌ నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారులు రూల్స్‌ పాటించడం లేదు. సిగ్నల్‌ రూల్స్‌ సైతం పాటించకుండా ప్రయాణం సాగిస్తున్నారు. 8లో u

బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026

నియోజకవర్గంలోని ర్యాంపులన్నీ సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉండటంతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. అధికారులను అడుగుతుంటే అనుమతులు లేవంటున్నారే తప్ప అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదు. ఎన్‌జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మేటలు, నదీ గర్భంలో తవ్వకాలు చేయడం వలన భూగర్భ జలాల్లో ఉప్పునీటి సాంద్రత పెరిగి స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది.

– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ మంత్రి

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు అటవీ విభాగంలో క్యాంపా పథకంలో 13 వాహనాలు కొనుగోలు చేసినట్లు జిల్లా అటవీశాఖాధికారి సందీప్‌ రెడ్డి తెలిపారు. అటవీ సంరక్షణ, రక్షణ, అగ్నిప్రమాదాల నియంత్రణ, చెట్ల కొట్టివేత అడ్డుకోవడం, వన్యప్రాణుల సంరక్షణ, క్షేత్రస్థాయిలో వేగవంతమైన పర్యవేక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ వాహనాలు దోహదపడతాయన్నారు. అటవీ వనరుల పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): ఈ నెల 11న రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, ఐదుగురు సభ్యులు ఏలూరు గిరిజన భవన్‌కు రానున్నారని ఎస్టీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆలిండియా నేషనల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ దేవరకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం వెంకటేశ్వర్ల బృందం కమిషన్‌ చైర్మన్‌ సోళ్ళ బొజ్జిరెడ్డిని ఏలూరు ఆస్పత్రి సెంటర్‌లో కలిసి ఆహ్వానించింది. చైర్మన్‌, సభ్యులకు అభినందన సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఏలూరు (టూటౌన్‌): జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని, ఖాళీగా ఉన్న రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ, ఎన్‌ఎస్‌ రామరాజు ప్రారంభించిన జనచైతన్య యాత్ర ఏలూరు చేరుకుంది. జనవరి 3న విశాఖపట్నంలో మొదలుపెట్టిన రైడ్‌ 8న తేదీన తిరుపతి చేరుకుంటుందని జిల్లా బ్యాంక్‌ ఉద్యోగుల సమన్వయ సంఘం ప్రధాన కార్యదర్శి కాళే శ్రీనివాసరావు తెలిపారు. ఆశ్రం ఆసుపత్రి వద్ద యాత్రకు బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం నాయకులు స్వాగతం పలికారు.

సాక్షి, భీమవరం: మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఇలాకాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది. గతేడాది కోట్లాది రూపాయల ఇసుకను తరలించేసిన అక్రమార్కులు ఇప్పుడు అదే పనిలో పడ్డారు. తీరం వెంట తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నారు. కోడేరులో బాటలు సిద్ధం చేస్తుండగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు.

జిల్లాలోని సిద్ధాంతం నుంచి బియ్యపుతిప్ప వరకు ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలో వశిష్ట గోదావరిలో ఆరు ఓపెన్‌ రీచ్‌లు, ఐదు డీసిల్టేషన్‌ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. సముద్రపు ఆటుపోట్లతో ఈ ప్రాంతంలో ఇసుకలో ఉప్పునీటి సాంద్రత ఎక్కువగా ఉండి నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడటం, తీరప్రాంత పరిరక్షణలో భాగంగా రెండేళ్ల క్రితం కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ (సీఆర్‌జెడ్‌) ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. అప్పటినుంచి ఈ ర్యాంపులు తెరుచుకోలేదు. ఇదే అదునుగా టీడీపీ నేతలు చక్రం తిప్పారు. సాధారణంగా ఇసుక తవ్వకాలు చేయాలంటే ఇరిగేషన్‌, మైనింగ్‌, పొల్యూషన్‌, రెవెన్యూ, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) అనుమతులు తప్పనిసరి. తీరప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతున జట్టు కార్మికులతో పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్‌ చేయాలి. ఏ విధమైన అనుమతులు లేకుండానే సిద్దాంతం నుంచి నరసాపురం వరకు గతంలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోయాయి. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుకాసురుల ఇష్టారాజ్యం అయ్యింది. ఎన్‌జీటీ నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్లతో నదీగర్భంలో రెండు మూడు మీటర్లు లోతున ఇసుకను తవ్వి కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొట్టారు. లోడింగ్‌ రూపంలో బయట అమ్మకాలు చేయడంతో పాటు ఎక్కడికక్కడ అనధికార స్టాకులు పెట్టి వరదల సమయంలో అధిక ధరలకు అమ్ముకున్నా అధికారులు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

బాటలకు సన్నాహాలు : గోదావరిలో వరద ప్రభావం తగ్గడంతో సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లి తదితర చోట్ల ఇసుక మేటలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గోదావరిలోకి లారీల రాకపోకలకు వీలుగా బాటలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కోడేరు వద్ద గతంలోని వరదలకు కొట్టుకుపోయిన పాత బాటను రాళ్లు వేసి పొక్లెయిన్లతో సరిచేస్తున్నారు.

భీమవరం: ఎరువుల డీలర్లు, రైతులు యూరియాతో పాటు జింక్‌, గుళికలు కొనుగోలు చేయాలని ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల తయారీ కంపెనీల ప్రతినిధులు, హోల్‌ సేల్‌, రిటైల్‌ డీలర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

బాట పనుల కోసం తీసుకొచ్చిన పొక్లెయిన్‌

గతేడాది తవ్వకాలు చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

టీడీపీ నాయకుడి పాత్రపై ఆరోపణలు

కొయ్యలగూడెం: యువకుడిపై సమీప బంధువైన ఓ వ్యక్తి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొయ్యలగూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై వి.చంద్రశేఖర్‌ వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం సత్యసాయినగర్‌కి చెందిన రాచూరి రవితేజ ఈ నెల 5న రాత్రి ఇంటి వద్ద ఉండగా సమీప బంధువైన అంగడాల నాగరాజు బీరు సీసాతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రవితేజ ముఖంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. రవితేజ తండ్రి సుబ్బారావు మాట్లాడుతూ తనకు, టీడీపీ నాయకుడైన తన అన్నకు మధ్య కోర్టు తగాదాలు ఉన్నాయని, తన అన్న బావమరిది నాగరాజు రాజీ పడాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు. తన అన్న ప్రోద్బలంతో తన కుమారుడిపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు.

ఏలూరు (టూటౌన్‌): సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు దక్షి ణమధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న విశాఖపట్నం–చర్లపల్లి (08513), 19న చర్లపల్లి–విశాఖపట్నం(08514) ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు.

పలు ప్రత్యేక రైళ్లు రద్దు : సంక్రాంతి సందర్భంగా ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్ళను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13న నడవాల్సిన నర్సాపూర్‌–చర్లపల్లి, 17న నడవాల్సిన చర్లపల్లి–నర్సాపూర్‌, 19న వికారాబాద్‌–చర్లపల్లి, వికారాబాద్‌–కాకినాడ టౌన్‌ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20న వికారాబాద్‌–నర్సాపూర్‌, వికారాబాద్‌–కాకినాడ టౌన్‌ రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

కోడేరు వద్ద బాట ఏర్పాటు చేస్తుండటంతో స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం తెలిసి బాట సిద్ధం చేస్తున్నవారు పొక్లెయినర్లను లంకల్లోకి తరలించేశారు. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ నేతలు తహసీల్దార్‌ సోమేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే సహించేది లేదని, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా అడ్డుకుంటామన్నారు. బాట ఏర్పాటుపై మైనింగ్‌శాఖ అధికారులు స్పందిస్తూ కోడేరు ప్రాంతంలో తనిఖీలు చేశామని, అయితే అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నట్టు ఆధారాలు దొరకలేదని, రాళ్లతో ఉన్న మట్టి దిబ్బలు, మధ్యలో అక్కడక్కడ కొట్టుకుపోయిన పాత బాట కనిపించినట్టు పేర్కొనడం గమనార్హం.

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు సన్నాహాలు

గోదావరి తీరం వెంట పాత ర్యాంపుల్లో బాటలు సిద్ధం చేసే పనిలో టీడీపీ నేతలు

కోడేరులో యంత్రాలతో బాటలు

అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

గతేడాది అక్రమ తవ్వకాలతో

కోట్లాది రూపాయలు స్వాహా

తవ్వేద్దాం.. దోచేద్దాం1
1/7

తవ్వేద్దాం.. దోచేద్దాం

తవ్వేద్దాం.. దోచేద్దాం2
2/7

తవ్వేద్దాం.. దోచేద్దాం

తవ్వేద్దాం.. దోచేద్దాం3
3/7

తవ్వేద్దాం.. దోచేద్దాం

తవ్వేద్దాం.. దోచేద్దాం4
4/7

తవ్వేద్దాం.. దోచేద్దాం

తవ్వేద్దాం.. దోచేద్దాం5
5/7

తవ్వేద్దాం.. దోచేద్దాం

తవ్వేద్దాం.. దోచేద్దాం6
6/7

తవ్వేద్దాం.. దోచేద్దాం

తవ్వేద్దాం.. దోచేద్దాం7
7/7

తవ్వేద్దాం.. దోచేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement