
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు
బుట్టాయగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే యత్నం చేస్తోందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. శుక్రవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ సాక్షి మీడియాపై దూకుడు వైఖరి రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కును నిరోధించేదిగా ఉందన్నారు. ప్రజల సమస్యలను, ఇబ్బందులను, ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తున్న సాక్షి మీడియాపై కూటమి సర్కారు అణచివేత ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రెండు రోజులుగా నెల్లూరు పోలీసులు సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు ఇస్తూ బెదిరింపులకు గురిచేయడం బాధాకరమని అన్నారు. ఎన్నడూలేని విధంగా మీడియా కార్యాలయాల్లో సో దాలు, ఎడిటర్, పాత్రికేయులపై వేధింపులు సరికాదన్నారు. కూటమి ప్రభుత్వ తీరును ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు.
ఏలూరు (టూటౌన్): రైళ్లలో మహిళకు భద్రత కల్పి ంచాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏలూరు జిల్లా ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు పి.హైమావతి, ఎ.శ్యామల రాణి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలులో మహిళపై అగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల రైళ్లలో మహిళలపై దాడులు పెరిగిపోయా యని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగి ఉన్న రైళ్లను అ డ్డాగా చేసుకుని, పని ప్రదేశాల్లో మహిళలపై దా డులు పెరుగుతున్నా రైల్వే అధికారులకు పట్టడం లే దన్నారు. రైళ్లలో పోలీసుల నిఘాపెంచాలని, ప్రతి బోగీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
భీమవరం ( ప్రకాశం చౌక్): భీమవరం గునుపూడిలోని పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం (సోమారామం)లో ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం దేవస్థానంలో ఆర్డీఓ ప్రవీణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పు లపర్తి రామాంజనేయులు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మొబైల్ టాయిలెట్స్, మంచినీరు, మెడికల్ క్యాంపులు తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. దేవస్థానం వద్ద పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు, ట్రా ఫిక్ సమస్య లేకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా దేవదాయశాఖ అధికారి సూర్యప్రకాష్, ఈఓ డి.రామకృష్ణంరాజు, దేవస్థానం చైర్మన్ బంగారురాజు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.