
చెరువులో మునిగి రిటైర్డ్ ఉద్యోగి మృతి
భీమడోలు: భీమడోలు శివాలయం వద్ద చెరువులో ప్రమాదవశాత్తు జారి పడి రైల్వే రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ మృతి చెందాడు. భీమడోలు గ్రామానికి చెందిన బసవ ప్రభాకరరావు(74) రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ నెల 15న సంతమార్కెట్కు సైకిల్పై వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అతని సైకిలు చెరువులో సమీపంలో దొరికింది. చెరువులో ప్రభాకరరావు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చలపతిరావు తెలిపారు.