పారా త్రోబాల్‌ జట్టు మేనేజర్‌గా సూర్యనారాయణ | - | Sakshi
Sakshi News home page

పారా త్రోబాల్‌ జట్టు మేనేజర్‌గా సూర్యనారాయణ

Oct 9 2025 3:19 AM | Updated on Oct 9 2025 3:19 AM

పారా

పారా త్రోబాల్‌ జట్టు మేనేజర్‌గా సూర్యనారాయణ

పారా త్రోబాల్‌ జట్టు మేనేజర్‌గా సూర్యనారాయణ మద్ది అంజన్న హుండీ ఆదాయం లెక్కింపు రేపు జిల్లా స్థాయి క్రీడా జట్ల ఎంపికలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శుక్రవారం అండర్‌ 14, అండర్‌ 17 బాల బాలికల క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్టు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి కె.అలివేలు మంగ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అండర్‌– 14, 17 బాలబాలికల బాస్కెట్‌బాల్‌ ఎంపిక పోటీలు, కొవ్వలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అండర్‌– 14,17 బాలబాలికలకు రెజ్లింగ్‌ ఎంపిక పోటీలు ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 90308 94311 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు.

అత్తిలి: ఈఏడాది డిసెంబర్‌ 15 నుండి 22 వరకు శ్రీలంక లో రత్నాపుర ఇండోర్‌ స్టేడియంలో మొదటి సౌత్‌ ఏషియన్‌ పారాత్రో బాల్‌ ఛాంపియన్‌ షిప్‌–2025 లో పాల్గొనే భారత పారా త్రో బాల్‌ జట్టు మేనేజర్‌గా అత్తిలికి చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ ఎంపికయ్యారని ఆంధ్రప్రదేశ్‌ పారాత్రో బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గండా కై లాష్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఆగస్టు 30, 31 తేదీల్లో కోయంబత్తూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్న ఆంధ్ర పారా త్రో బాల్‌ జట్టుకి మేనేజర్‌గా సూర్యనారాయణ వ్యవహరించారని తెలిపారు. ఈ పోటీల్లో ఆంధ్ర పారాత్రో బాల్‌ జట్టు విజేతగా నిలిచిందని కై లాష్‌ పేర్కొన్నారు.

జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్‌ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్‌ సిబ్బంది, ఆలయ సిబ్బంది హుండీలను తెరిచి లెక్కింపు నిర్వహించారు. 111 రోజులకు గానూ దేవస్థానంలోని హుండీల ద్వారా రూ.60,84,458, అన్నదానం హుండీ ద్వారా రూ.76,609లు మొత్తం రూ. 61,61,067 ఆదాయం సమకూరినట్లు మద్ది ఆలయ ఈఓ, సహాయ కమిషనర్‌ ఆర్‌వీ చందన తెలిపారు.

పారా త్రోబాల్‌ జట్టు మేనేజర్‌గా సూర్యనారాయణ 1
1/1

పారా త్రోబాల్‌ జట్టు మేనేజర్‌గా సూర్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement