
సరైన వసతి, రవాణా సౌకర్యాలు కల్పించాలి
ఏలూరు(మెట్రో): నియామక పత్రాల స్వీకరణకు వెళ్లే డీఎస్సీ అభ్యర్థులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చక్కని వసతి, రవాణా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రయాణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఈ నెల 25న వెలగపూడిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందిస్తారని, ఈ కార్యక్రమానికి అభ్యర్థులను తీసుకువెళ్లేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. అభ్యర్థులు బుధవారం బసకు సంబంధించి దుప్పట్లు, తదితర సామాను తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.