తమ్మిలేరుకు భారీగా నీరు | - | Sakshi
Sakshi News home page

తమ్మిలేరుకు భారీగా నీరు

Sep 19 2025 2:19 AM | Updated on Sep 19 2025 2:19 AM

తమ్మి

తమ్మిలేరుకు భారీగా నీరు

తమ్మిలేరుకు భారీగా నీరు లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ఏలూరు(మెట్రో): స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలో బార్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి నిర్వహించారు. మొదటి నోటిఫికేషన్‌లో మిగిలిన తొమ్మిది ఓపెన్‌ కేటగిరీ బార్లకు సంబంధించి నాలుగు లేదా అంతకు మించి దరఖాస్తులు వచ్చిన రెండు బార్లను లాటరీ ద్వారా కేటాయించారు. లాటరీ ద్వారా ప్రభుత్వానికి రూ.59.13 లక్షల ఆదాయం సమకూరింది. ఎక్సైజ్‌ డీసీ బి.శ్రీలత, జిల్లా మధ్య నిషేధ, అబార్కీ అధికారి ఎ.ఆవులయ్య, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్లు జి.పాండు రంగారావు, అజయ్‌ కుమార్‌సింగ్‌, సీఐలు పాల్గొన్నారు. 4 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఏలూరు(మెట్రో): జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 4 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని, ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణ ముందస్తు ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణలో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. జిల్లాలో 1,91,534 ఎకరాల్లో వరి సాగవుతుండగా 5,74,552 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. దీనిలో 4 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ దేవకీదేవి, డీఎస్‌ఓ అబ్రహం, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ శివరామమూర్తి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌కే హబీబ్‌ బాషా, ఉప రవాణా కమిషనర్‌ షేక్‌ కరీం, డీసీఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచాలి పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి

చింతలపూడి: జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. గురువారం అధికారులు 301 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 347.72 అడుగులకు, గోనెలవాగు బేసిన్‌ 347.45 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్‌ ఏఈ లాజరుబాబు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు కాగా 0.660 టీఎంసీలకు, గోనెల వాగు బేసిన్‌ 1.109 అడుగులకు చేరుకున్నట్టు చెప్పా రు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి అలుగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో గంటకు 637 క్యూసెక్కుల నీరు ఆంధ్రా కాల్వ ద్వారా ప్రాజెక్టులోకి వస్తుందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటి ని నిల్వ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు డీఈ తెలిపారు.

ఏలూరు (టూటౌన్‌): మున్సిపల్‌ కార్మికులకు 12వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని, ఇంజనీరింగ్‌, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కాలపు జీతాలను విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్‌.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఏలూరు కార్పొరేషన్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. వేతనాల పెంపు, సమ్మె కాలపు జీతాల విడుదల, ఎక్స్‌గ్రేషియా పెంపు, డీఏ బకాయిలు, సరెండర్‌ సెలవులు ఎన్‌క్యాష్‌మెంట్‌, క్లాప్‌ డ్రైవర్లు తదితర సమస్యలను విన్నవించారు. సీఐటీయూ నాయకులు జె.గోపి, ఎం. ఇస్సాకు, అరుణకుమారి పాల్గొన్నారు.

భీమవరం: భీమవరంలో ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సీపీఎం లంకపేటశాఖ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం పట్టణ నాయకుడు ఎం.వైకుంఠరావు మాట్లాడుతూ ప్రభుత్వ భూ ముల్లో పేదలకు పట్టాలిస్తామని కూటమి ప్ర భుత్వం చేసిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. గతనెలలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసినా అధికారులు కనీసం విచారణ చే యకపోవడం దారుణమన్నారు. సొంతిల్లు లేక పేదలు నానా అవస్థలు పడుతున్నారన్నా రు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.

తమ్మిలేరుకు భారీగా నీరు 1
1/2

తమ్మిలేరుకు భారీగా నీరు

తమ్మిలేరుకు భారీగా నీరు 2
2/2

తమ్మిలేరుకు భారీగా నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement