● పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ఫైబర్ కలిగినవి తీసుకోవాలి.
● రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు.
● పుట్టిన నాటి నుంచి 6 నెలల వయస్సు వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే అందించాలి. 2 సంవత్సరాల పైనే తల్లి పాలు బిడ్డకు కొనసాగించవచ్చు.
● స్నాక్స్, చక్కెర, కొవ్వులు, ఉప్పు ఎక్కువగా ఉండే అహారం తీసుకోవద్దు.
● చేపలు, గుడ్లు, పాలు, మాంసం, కూరగాయలు, పండ్లు సమపాళ్లలో తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను ఎక్కువగా ఉడికిస్తే విటమిన్లు కోల్పోతాయి.
● ప్రతి రోజూ వ్యాయామం, నడక, యోగసానాలు అలవర్చుకోవాలి.
● బలహీనంగా ఉన్న పిల్లలకు ప్రత్యేక పోషకాహారం అందించాలి.