వ్యాపారుల ప్రవేశంతో రాజకీయాలు కలుషితమవుతున్నాయి. నేతల మైండ్సెట్ మారకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదు. కీలకమైన వ్యవస్థలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. మంచి పరిపాలన అందించాలనే మైండ్సెట్ను రాజకీయ నాయకులు అలవరచుకోవాలి. పోస్టింగ్ల కోసం రాజకీయ నాయకుల చుట్టూ పోలీసులు తిరిగితే ఇక ప్రజలకు ఏవిధంగా జవాబుదారీగా ఉంటారు? ఐఏఎస్, ఐపీఎస్ వంటి చదువులు చదువుకుని కూడా రాజకీయ నాయకులు చెప్పిందే చేయడం అవివేకం.
– డాక్టర్ గూడూరి శ్రీనివాస్,
వైఎస్సార్ సీపీ రాజమండ్రి
పార్లమెంటరీ కో ఆర్డినేటర్


