
పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్
● 21 నుంచి కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన
● 25 నుంచి ఆప్షన్ల ఎంపిక
● జూలై 3న సీట్ల కేటాయింపు
రాయవరం: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 30న నిర్వహించిన పాలిసెట్–2025లో జిల్లావ్యాప్తంగా 3,830 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,162 మంది బాలురు, 1,668 మంది బాలికలు ఉన్నారు. వీరు ర్యాంకుల వారీగా ఇచ్చిన తేదీల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు నిర్వహించే కౌన్సెలింగ్లో ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. దీని కోసం అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని శ్రీ వైవీఎస్ అండ్ బీఆర్బీఎం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం దగ్గరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు విద్యార్థులు వెళ్లి ఆప్షన్స్ ఉచితంగా ఎంపిక చేసుకోవచ్చు.
షెడ్యూల్ మేరకు తమ ర్యాంకును బట్టి విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలి. అనంతరం వారికిచ్చిన తేదీ ప్రకారం ఆన్లైన్లో అడ్మిషన్ పొందాలి. ఓసీ, బీసీలు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చొప్పున ఆన్లైన్ విధానంలో ప్రాసెస్ ఫీజు చెల్లించాలి. ఆ రశీదు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికెట్ లేని వారు ఏడేళ్ల రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ వర్తించే వారు అర్హత ధ్రువపత్రం అందజేయాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నాన్ లోకల్ విద్యార్థులు మైగ్రేషన్ సర్టిఫికెట్, పీడబ్ల్యూడీ, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ వంటి ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారు అర్హత ధ్రువీకరణ పత్రాలను కౌన్సెలింగ్ సమయంలో సబ్మిట్ చేయాలి. వీరికి ఈ నెల 25 నుంచి 28 వరకూ విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు.
జిల్లాలో 6 కళాశాలలు
రామచంద్రపురంలో ప్రభుత్వ కళాశాలతో పాటు ప్రైవే టు యాజమాన్యంలో మరో ఐదు పాలిటెక్నిక్ కళాశాల లు జిల్లాలో ఉన్నాయి. వీటిల్లో కంప్యూటర్, ఎలక్ట్రా నిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులున్నాయి. పలు కళాశాలల్లో ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 33, మెకానికల్ 33 సీట్లు ఉండగా, ఐదు ప్రైవేట్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 1,500 వరకూ సీట్లు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కింద 10 శాతం అదనంగా సీట్లు పెంచి ప్రతి బ్రాంచిలో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు కాల వ్యవధి మూడు సంవత్సరాలు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ సైతం ఇస్తారు.
షెడ్యూల్ ప్రకారం నిర్వహణ
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. పాలిసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి, షెడ్యూల్ ప్రకారం ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలి. ర్యాంకు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది.
– కేపీవీఎస్ఎన్ ప్రసాద్, పాలిసెట్ జిల్లా
కో ఆర్డినేటర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ
పాలిటెక్నిక్ కళాశాల, ద్రాక్షారామ
జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల వివరాలు
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రామచంద్రపురం: డీఎంఈ–33, డీసీఈ–33.
శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల: డీసీఈ–30, డీఎంఈ–30, డీఈఈ–60, డీఈసీఈ–60, డీసీఎంఈ–120, డీఏఐఎం–60.
బీవీసీ, ఇంజినీరింగ్ కళాశాల: డీసీఎంఈ–180, డీఈసీఈ–60, మెకానికల్–30, ఈఈఈ–30.
వీఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాల, రామచంద్రపురం: డీసీఎంఈ–120, సీసీఎన్–60, డీఈసీఈ–60, ఈఈఈ–60, మెకానికల్–60.
శ్రీ వైవీఎస్ అండ్ శ్రీ బీఆర్ఎం పాలిటెక్నిక్ కళాశాల, ముక్తేశ్వరం: డీఈఈఐఈ–30, డీసీఎంఈ–54, డీఈసీఈ–60, డీఈఈఈ–108, డీఎంఈ–108.
కై ట్ ఇంజినీరింగ్ కళాశాల, రామచంద్రపురం: డీసీఎంఈ–120, డీఈసీఈ–60, సివిల్–30, డీఈఈఈ–30, మెకానికల్–30, ప్యాకింగ్ టెక్నాలజీ–30.
సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్ ఇలా..
తేదీ సమయం ర్యాంకు
జూన్ 21 ఉదయం 9.00 1–7,499
మధ్యాహ్నం ఒంటిగంట 7,501–15,000
22 ఉదయం 9.00 15,001–23,500
మధ్యాహ్నం ఒంటిగంట 23,501–32,000
23 ఉదయం 9.00 32,001–40,000
మధ్యాహ్నం ఒంటిగంట 40,001–50,000
24 ఉదయం 9.00 50,001–59,000
మధ్యాహ్నం ఒంటిగంట 59,001–68,000
25 ఉదయం 9.00 68,001–77,000
మధ్యాహ్నం ఒంటిగంట 77,001–86,000
26 ఉదయం 9.00 86,001–95,000
మధ్యాహ్నం ఒంటిగంట 95,001–1,04,000
27 ఉదయం 9.00 1,04,001–1,12,000
మధ్యాహ్నం ఒంటిగంట 1,12,001–1,20,000
28 ఉదయం 9.00 1,20,001–1,27,000
మధ్యాహ్నం ఒంటిగంట 27,001–చివరి ర్యాంకు వరకూ
ఆప్షన్ల ఎంపిక తేదీలు
తేదీలు ర్యాంకులు
జూన్ 25, 26 1–50,000
27, 28 50,0001–90,000
29, 30 90,0001–చివరి
ర్యాంకు వరకూ
అడ్మిషన్ల సమయంలో ఒరిజనల్ సర్టిఫికెట్లు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు.
జూలై 1న ఆప్షన్ల మార్పునకు అవకాశం.
జూలై 3న సీట్ల కేటాయింపు.