వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య 

Woman Deceased By Extra Marital Affair In Mahabubnagar District - Sakshi

కొత్తకోట రూరల్‌ (పెద్దమందడి): ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేసి చెరువులో పడేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమందడి మండలం చీకురుచెట్టుతండాకు చెందిన ముడావత్‌ దుబ్లీ (26) కి వనపర్తి మండలంలోని చిట్యాల–పడమటితండా వాసి వెంకటేష్‌తో సుమారు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఆరు నెలల క్రితం భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి జిల్లా కేంద్రంలో రోజువారీ కూలీగా పనికి వెళ్లొచ్చేది. ఎప్పటిలాగే ఈనెల 7న అక్కడికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. అనుమానం వచ్చిన తల్లి ముడావత్‌ ముత్యాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 10న పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం గోపాల్‌పేట మండలం తాడిపత్రిలోని చెరువులో ఆమె మృతదేహం తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఈ మేరకు ఎస్‌ఐ హరిప్రసాద్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆమెతో తాడిపత్రికి చెందిన రమేష్, గోపాల్‌ కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు బయటపడింది. ఈ క్రమంలోనే వీరి నుంచి డబ్బులు ఎక్కువ అడిగిందనే నెపంతో ఈనెల 7న కారులో తిరుమలాపూర్‌ శివారులోకి దుబ్లీని తీసుకెళ్లి గొంతునులిమి చంపి తాడిపత్రి చెరువులో పడేసినట్టు విచారణలో నిందితులు అంగీకరించారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top