రూ.4.55 కోట్ల బంగారం పట్టివేత  | Gold seized in Hyderabad | Sakshi
Sakshi News home page

రూ.4.55 కోట్ల బంగారం పట్టివేత 

Oct 28 2023 2:53 AM | Updated on Oct 28 2023 2:53 AM

Gold seized in Hyderabad - Sakshi

జహీరాబాద్‌/సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సరిహద్దులో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు.

గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న స్కార్పియో వాహనంలో 6,986 గ్రాముల బంగారు నగలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.55 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లో శుక్రవారం చేసిన తనిఖీల్లో రూ. 2,56,84,671 నగదును సీజ్‌ చేసినట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement