మాయలేడి: పెళ్లి చేసుకుంటానని చెప్పి 30 లక్షలకు టోకరా..

Girl Cheats Boy In The Name Of Marriage In Karnataka - Sakshi

యశవంతపుర(కర్ణాటక): పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి తనను రూ.30 లక్షలు మోసగించిందని అనంత్‌ మల్య అనే వ్యక్తి హెచ్‌ఎఎల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. బెంగళూరుకు చెందిన యువతితో 2019లో అనంత్‌ మల్యకు పరిచయమైంది.

కొంతకాలానికే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. నిన్నే పెళ్లి చేసుకుంటానని మల్యకు యువతి తీయని మాటలు చెప్పి రూ.30 లక్షల వరకూ తీసుకుంది. డబ్బు తిరిగి ఇవ్వలేదు, కొంతకాలంగా యువతి ఆచూకీ లేదని బాధితుడు వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: కరోనా మరణాల లెక్కలు.. కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top