అన్నానగర్: కోవిల్పట్టి బస్టాండ్ వద్ద ఒక యువకుడిని అతని ప్రియురాలి కళ్లెదుటే కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రియురాలి తండ్రి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లాలోని కోవిల్పట్టి సమీపంలో ఉన్న కరడికుళం ప్రాంతానికి చెందిన మాణిక్కం కుమారుడు సంజయ్ (18). ఇతను చెన్నైలో శిల్పిగా పనిచేస్తున్నాడు. ఇతను కేచ్చిలపురానికి చెందిన కుమార్ కుమార్తెను ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహారాన్ని కుమార్ ఒప్పుకోలేదు. కొన్ని రోజుల క్రితం, సంజయ్ విహారయాత్ర కోసం పట్టణానికి వచ్చాడు.
సోమవారం రాత్రి, సంజయ్ తన స్నేహితులతో కలిసి చెన్నైకి తిరిగి వెళ్లడానికి నాలుగు వరుసల రహదారిపై ఉన్న కోవిల్పట్టి అదనపు బస్టాండ్కు చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుమార్, సంజయ్తో మాట్లాడటానికి తన కుమార్తె, బంధువులైన శంకరనారాయణన్ (51), మారిముత్తు (38)తో కలిసి అక్కడికి వచ్చాడు. కుమార్, శంకరనారాయణన్, మారిముత్తు సంజయ్తో మాట్లాడుతుండగా, వారి మధ్య అకస్మాత్తుగా వాగ్వాదం చెలరేగింది.
ఆగ్రహానికి గురైన వారు, తాము దాచి ఉంచిన కత్తితో సంజయ్ను పొడిచారు. ఇది చూసి అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. అతని ప్రియురాలు దిగ్భ్రాంతికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంజయ్ ను రక్షించి, చికిత్స కోసం నెల్లై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తీవ్ర చికిత్స అందించినప్పటికీ, సంజయ్ మరణించాడు.హత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి కుమార్, శంకరనారాయణన్, మారిముత్తు అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ବ୍ରହ୍ମପୁର ଗିରିରୋଡରେ ଜଣେ ଯୁବକଙ୍କୁ ସର୍ବସାଧାରଣରେ ନିର୍ମମ ଭାବେ ଆକ୍ରମଣ କରାଯିବା ଘଟଣା ଅତ୍ୟନ୍ତ ଦୁର୍ଭାଗ୍ୟଜନକ ଓ ନିନ୍ଦନୀୟ। ଏପରି ଘଟଣା ରାଜ୍ୟର ଆଇନ ଶୃଙ୍ଖଳା ପରିସ୍ଥିତି କେତେ ଦୁର୍ବଳ ହୋଇପଡ଼ିଛି, ତାହା ସ୍ପଷ୍ଟ କରୁଛି। ସାଧାରଣ ଜନତାଙ୍କ ସୁରକ୍ଷା ଓ ଶାନ୍ତି ବଜାୟ ରଖିବା ପାଇଁ ସରକାର ତୁରନ୍ତ କଡ଼ା ପଦକ୍ଷେପ ଗ୍ରହଣ କରନ୍ତୁ। pic.twitter.com/9bX8FaWVAh
— Saptagiri Ulaka (@saptagiriulaka) May 19, 2026


