ప్రియురాలి ఎదుటే ప్రియుడి హత్య | Brahmapur Giriroad Incident | Sakshi
Sakshi News home page

ప్రియురాలి ఎదుటే ప్రియుడి హత్య

May 20 2026 1:58 PM | Updated on May 20 2026 1:58 PM

 Brahmapur Giriroad Incident

అన్నానగర్‌:  కోవిల్‌పట్టి బస్టాండ్‌ వద్ద ఒక యువకుడిని అతని ప్రియురాలి కళ్లెదుటే కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రియురాలి తండ్రి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లాలోని కోవిల్‌పట్టి సమీపంలో ఉన్న కరడికుళం ప్రాంతానికి చెందిన మాణిక్కం కుమారుడు సంజయ్‌ (18). ఇతను చెన్నైలో శిల్పిగా పనిచేస్తున్నాడు. ఇతను కేచ్చిలపురానికి చెందిన కుమార్‌ కుమార్తెను ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహారాన్ని కుమార్‌ ఒప్పుకోలేదు. కొన్ని రోజుల క్రితం, సంజయ్‌ విహారయాత్ర కోసం పట్టణానికి వచ్చాడు. 

సోమవారం రాత్రి, సంజయ్‌ తన స్నేహితులతో కలిసి చెన్నైకి తిరిగి వెళ్లడానికి నాలుగు వరుసల రహదారిపై ఉన్న కోవిల్‌పట్టి అదనపు బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుమార్, సంజయ్‌తో మాట్లాడటానికి తన కుమార్తె, బంధువులైన శంకరనారాయణన్‌ (51), మారిముత్తు (38)తో కలిసి అక్కడికి వచ్చాడు. కుమార్, శంకరనారాయణన్, మారిముత్తు సంజయ్‌తో మాట్లాడుతుండగా, వారి మధ్య అకస్మాత్తుగా వాగ్వాదం చెలరేగింది. 

ఆగ్రహానికి గురైన వారు, తాము దాచి ఉంచిన కత్తితో సంజయ్‌ను పొడిచారు. ఇది చూసి అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. అతని ప్రియురాలు దిగ్భ్రాంతికి గురైంది. సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంజయ్‌ ను రక్షించి, చికిత్స కోసం నెల్లై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తీవ్ర చికిత్స అందించినప్పటికీ, సంజయ్‌ మరణించాడు.హత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి కుమార్, శంకరనారాయణన్, మారిముత్తు అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement