శాంతిపురం: కనుమలదొడ్డి నుంచి రాళ్లబూదుగూరు మీదుగా కర్ణాటకలోని కేజీఎఫ్ వెళ్లే రోడ్డు పక్కన కర్లగట్ట క్రాసు వద్ద ఉన్న బస్ షెల్టర్ కుప్పం కూలింది. మంగళవారం సాయంత్రం కొద్ది పాటి వర్షాని తోడు పెను గాలులు వీయడంతో బస్ షెల్టర్ ముందుకు పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేపోవడంతో ప్రమాదం తప్పింది. గతంలో హెచ్పీ (హ్యూలెట్–ప్యాకర్డ్) సంస్థ ఇనుప పైపులు, రేకులతో ఈ బస్ షెల్టరును నిర్మించగా తర్వాతి కాలంలో దాని నిర్వహణ లేకపోవడంతో గాలి తాకిడికి కూలిపోయింది.


