గుడిపాల: పంట పొలాలపై ఏనుగులు బీభత్సం సృష్టిస్తుంచాయి. 15 ఏనుగుల గుంపు ఒక్కసారిగా పంట పొలాలపై పడడంతో రైతులు ఆందోళన చెందారు. గుడిపాల మండలంలోని బట్టుబాళ్లూరు, పిళ్లారికుప్పం, ముత్తువాళ్లూరు, పల్లూరు, పానాటూరు గ్రామాల్లో రైతులు పండించిన వరి, అరటి, మామిడి, కొబ్బరి పంటలను ధ్వంసం చేశాయి. దీంతో బోరు మోటార్లుతో పాటు పైపులు, పెన్సింగ్లను కూడా ధ్వంసం చేశాయి. సుమారు 2 0మంది రైతులకు సంబంధించి పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. అటవీశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.


