చిత్తూరు నగరంలోని మురకంబట్టులో రెండు రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. దాదాపు 160 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు.. రూ.3 లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచుకుని, అందరూ బయట వెళ్లడం.. పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమే ఈ చోరీకి ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు.
పలమనేరు నియోజకవర్గంలోని గంగవరంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాసులు కుటుంబం కాకినాడ వెళ్లారు. ఇంట్లో విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు సైతం ఉంచారు. తలుపునకు తాళం వేసి ఉండడాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు.. తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇక్కడా బాధితులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు.’’
స్మార్ట్ లాక్ ఉత్తమం
వేసవిలో పట్టణాలు, గ్రామాల్లో చాలామంది ఆరుబయట, మిద్దైపెన నిద్రపోవడం అలవాటు. ఇదే అదునుగా నిద్రించే వారి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు ఎత్తుకెళుతున్నారు. ఇంటి తాళాలు పగులగొట్టి దోచేస్తున్నారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో స్మార్ట్ లాక్లను ప్రజలకు తెప్పించి ఇచ్చాం. ఇలా శబ్దాన్ని మోగించడం వల్ల ప్రజలు అప్రమత్తం అవ్వొచ్చు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. పోలీసు శాఖ తరఫున రాత్రివేళ గస్తీ ముమ్మురం చేసేందుకు ప్రణాళిక రూపొందించాం.
సమాచారమిస్తే..
.. ఈ రెండు ఘటనలేకావు.. జిల్లాలో తరచూ ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. వేసవి సరదాలనే కాదు.. దొంగల బెడదనూ తెచ్చిపెడుతోంది. సెలవుల్లో సొంతూర్లకు వెళ్లడం, విహార యాత్రలు, ప్రయాణాలు, శుభకార్యాలు, ఆరుబయట నిద్ర లాంటివి దొంగలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఊరికి వెళ్లే సమయంలో ఇంటికి తాళం వేయాల్సి వస్తే పలు జాగ్రత్తలు తీసుకోకుంటే దొంగలు చొరబడి ఉన్నదంతా ఊడ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పలు జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచిస్తున్నారు. ఆయన సూచనలు ఇలా.. – చిత్తూరు అర్బన్


