వైఎస్సార్సీపీ సీనియర్ నేతకు పెద్దిరెడ్డి నివాళి
దహనక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ భరత్
మధుసూదన్రెడ్డి మృతదేహానికి నివాళి అర్పిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి
రామకుప్పం(కుప్పం): కుప్పం నియోజకవర్గ సీనియర్ నాయకులు, బోయకొండ గంగమ్మ దేవస్థాన మాజీ డైరెక్టర్ స్వరూపారెడ్డి భర్త మధుసూదన్రెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న రారష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం చెల్లిగానిపల్లి చేకున్నారు. మధుసూదన్రెడ్డి మృతదేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సీనియర్ నేతల మృతి పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. నివాళి అర్పించిన వారి లో జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసు, మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్ తదితరులున్నారు.


