చిత్తూరు అర్బన్: మహిళల గౌరవం,, భద్రతను కాపాడడం అందరి బాధ్యతని చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్రాజు తెలిపారు. మహిళా దినోత్సవ వారోత్సవాల నేపథ్యంలో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో బ్యాండ్ షో ర్యాలీ నిర్వహించారు. ఏఆర్ పోలీసు కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఏఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. ఏఆర్ ఏఎస్పీ దేవదాసు, డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్బాషా, సీఐలు మహేశ్వర, శ్రీధర్ నాయుడు, నిత్యబాబు, శ్రీనివాసంతి పాల్గొన్నారు.


