ఎన్నిసార్లు పిలిచినా..
నచ్చితే పనులు చేస్తాం.. లేకుంటే లేదు రూ.30 లక్షలు దాటితే సరి.. తక్కువైతే? అభివృద్ధి పనుల టెండర్ల వాయిదాల పర్వం చిత్తూరు కార్పొరేషన్లో కాంట్రాక్టర్ల విచిత్ర పోకడ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మౌలిక వసతులు–సదుపాయాలు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రూ.2 లక్షల వ్యయంతో కాలువలు పూర్తిచేస్తే సమస్య పరిష్కారమవుతుంది. మరికొన్ని చోట్ల రూ.3 లక్షలతో రోడ్డు వేస్తే అక్కడి ప్రజల ఆనందానికి అవధులు ఉండవు. ఈ పనులను పూర్తి చేయడానికి నిబంధనల ప్రకారం ఆన్లైన్ టెండర్లు పిలవడం, వచ్చిన దరఖాస్తుల్లో నిర్ణయించిన ధర కంటే తక్కువ మొత్తం కోట్ చేసిన వాళ్లకు పనులను అప్పగించి, వాటిని సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంటుంది. ఇందులో భాగంగానే నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి కాలువలు, రోడ్లు వేయడం.. పారిశుద్ధ్య నిర్వహణకు చీపుర్లు, గడ్డపార, ఇతర పనిముట్లు, రోడ్లపై గుంతలు పూడ్చడానికి అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటికే రెండు సార్లకుపైగా టెండర్లు పిలిచినా, ఒక్కరు కూడా దరఖాస్తు వేయలేదు. గత నెల 21న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్లో రూ.55.39 లక్షల విలువ చేసే పలు పనులను చేయడానికి అధికారులు నోటిఫికేషన్ ఇస్తే, సోమవారం గడువు ముగిసింది. చాలా పనులకు ఒక్క టెండరు కూడా పడలేదు.
చేయిస్తాం..
కొన్ని పనులకు రెండు, మూడు సార్లు టెండర్లు పిలిచినా దరఖాస్తులు పడలేదు. ఫలితంగా చిన్న చిన్న పనులు చేయించడం కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. కాంట్రాక్టర్లను పిలిపించి ఓసారి మాట్లాడుతాం. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేయిస్తాం.
– వెంకటరామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్


