మా గతి ఇంతేనా సర్!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను పట్టించుకోండి సారూ అంటూ మామిడి రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్రెడ్డి కోరారు. ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీని కలిసి పలు సమస్యలపై చర్చించారు. ఆయన కలెక్టర్తో మాట్లాడుతూ 2025లో మామిడి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. రాబోయే సీజన్లోనైనా రైతులకు న్యాయం చేయాలన్నారు. ఆ సంఘం నాయకులు సంజీవరెడ్డి, హేమలత, మునిరత్నంనాయుడు, త్యాగరాజరెడ్డి, సందీప్రెడ్డి, మోహన్రెడ్డి, భారతి, జయదేవయ్య, చెంగల్రాయరెడ్డి పాల్గొన్నారు.


