భక్తులకు క్షమాపణలు చెప్పాలి
నాయుడుపేట టౌన్ : శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూటమి నేతలు దుష్పచారం చేస్తున్నారు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు భక్తులకు క్షమాపణలు చెప్పాలి అని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. తిమ్మాజీకండ్రిగ వద్ద స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అభయానుగ్రహ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంజీవయ్యతోపాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి శుక్రవారం పూజ లు చేశారు. ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.


