రోబోటిక్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్: జాతీయస్థాయి ఏడో రోబో టిక్ పోటీల్లో బృందావన్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారని చైర్మన్ శైలజ తెలిపారు. సంతపేట వద్ద ఉన్న ఆ కళాశాలలో ఆమె శనివా రం విలేకరులతో మాట్లాడారు. చైన్నెలో వీఐటీ విశ్వవిద్యాలయంలో శనివారం ఏడో జాతీయస్థాయి రోబోటిక్ పోటీలు నిర్వహించారన్నా రు. ఈ పోటీల్లో 51 పాఠశాల, కళాశాలల నుంచి 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. ఈ పోటీలో తమ పాఠశాల నుంచి 48 మంది విద్యార్థులు పాల్గొనగా 31 మంది బహుమతులు సాధించారన్నారు. అనంతరం బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రియ తేజ, టీచర్లు పాల్గొన్నారు.


