కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు | - | Sakshi
Sakshi News home page

కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

Oct 18 2025 7:09 AM | Updated on Oct 18 2025 7:09 AM

కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచలకిషోర్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1,77,02,032ల ఆదాయం వచ్చింది. బంగారం 52 గ్రాములు, వెండి 510 కిలోలు లభించింది. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.16,845, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.20,699 వచ్చింది. యూఎస్‌ఏవి 139 డాలర్లు, సింగపూర్‌వి 2 డాలర్స్‌, మలేషియావి 11 రింగిట్స్‌, యూఏఈ 25 దిర్హామ్స్‌, కెనడా 110 డాలర్లు, ఆస్ట్రేలియావి 110 డాలర్స్‌, యూరోవి 10 యూరోలు వచ్చాయి. డీఈవోలు సాగర్‌బాబు, ఏఈవోలు ఎస్వీ క్రిష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్‌, ధనపాల్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement