
గుండెపోటుతో న్యాయవాది మృతి
పాలసముద్రం: మండలంలోని పాలసముద్రం దళితవాడకు చెందిన అడ్వొకేట్ గాంధీ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. చిత్తూరు కోర్టు నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్నప్పుడు 7 గంటలకు గుండె నొప్పిగా ఉందని కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి న్యాయవాదులు చిత్తూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు.
కుటుంబ కలహాలతో
సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
ఏర్పేడు : ఏర్పేడు మండలంలోని కందాడ దళితవాడకు చెందిన సచివాలయ ఉద్యోగి కు టుంబ కలహాలతో గురు వారం రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాలు. ఏర్పేడు మండలం కందాడ దళితవాడకు చెందిన బొంద మునె య్య, సాయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో రెండో కుమారుడు బొంద నిరంజన్(27) శ్రీకాళహస్తి మండలం బీవీపురం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. కందాడ దళితవాడకు చెందిన సుబ్రమణ్యం, చంద్రికల కుమార్తె విద్యప్రియను ఈ ఏడాది మార్చి 12న వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నిరంజన్ భార్య విద్యప్రియ గర్భిణి. అత్తమామలు, భార్య వేధింపులకు తోడు అప్పులు ఎక్కువ కావడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో నిరంజన్ గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అమ్మా.. నాన్నా ఇక సెలవు..
మృతుడు నిరంజన్ వద్ద లభించిన సూసైడ్ నోట్ను బట్టి అత్తమామలు, భార్య వేధింపులు, అప్పులు ఎక్కువ కావడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. లేఖలో.. ‘పోలీసు వారికి మనవి.. నాకు పైళ్లెనప్పటి నుంచి భార్య, వాళ్ల అమ్మ, హేమలత(పెద్దమ్మ) నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాభార్య కూడా నన్ను చంపేదాక తీసుకొచ్చింది. దానికి రిలేటెడ్గా కాల్డేటా తీయండి సార్.. వీళ్లు నన్ను టార్చర్ పెట్టి చంపేసి నా భార్యకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు.. మా అమ్మా,నాన్న, అన్న, వదిన, తమ్ముడును కాపాడండి సార్.. ‘అమ్మా.. నాన్నా సారీ నాన్నా.. ఇక సెలవు.. ఇంకో జన్మలో మిమ్మల్ని బాగా చూసుకుంటా..’ అంటూ సూసైడ్నోట్లో నిరంజన్ రాసినట్లు గుర్తించారు.

గుండెపోటుతో న్యాయవాది మృతి