
ప్రజాస్వామ్యం ఖూనీ
ప్రజలకు వాస్తవాలను తెలిపే పత్రికలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం, దాడులు చేయడం, వేధించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, అరాచకాలపై రాజకీయ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు, ప్రసంగాలను సాక్షి దిన పత్రికలో ప్రచురించారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. పత్రిక, ఎడిటర్, సిబ్బందిని నిందితులుగా చేర్చడం కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారి లోపాలను ఎత్తిచూపే పత్రికలపై కేసులు పెట్టి, వేధించడం దారుణం. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పత్రికలు నిర్వీర్యమైపోతాయి. అధికారబలం ఉన్నవాడికే జీవించే హక్కు లభిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికై నా ఈ విషయంలో పునరాలోచించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి. – బియ్యపు మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ,శ్రీకాళహస్తి