
● పుష్పపల్లకీలో పురుషోత్తముడు
తిరుమల వేంకటేశ్వర స్వామి దేవేరులతో కలసి బుధవారం సాయంత్రం పుష్పపల్లకీలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం ఆణివార ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై కొలువుదీర్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
– తిరుమల