
బోయకొండ ఆలయంలో భక్తుల రద్దీ
చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి విశేషాలంకరణ చేశారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతోపాటు, జంతు బలులులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయంలో ఒకసారిగా భక్తుల రద్దీ పెరగడంతో క్యూలన్నీ కిటకిటలాడాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓచంద్రమౌళి పర్యవేక్షించారు. భక్తులకు ఉచితంగా తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.