వోల్వో కార్ ఇండియా.. 2026 మే 1 నుంచి తమ కార్ల ధరలను లక్ష రూపాయల వరకు పెంచుతున్నట్లు ధృవీకరించింది. ఇటీవల పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఆడి, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ఇతర లగ్జరీ బ్రాండ్లు కూడా ధరలను సర్దుబాటు చేయవలసి వస్తున్న నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
వోల్వో భారత పోర్ట్ఫోలియోలో నాలుగు ప్రధాన మోడళ్లు ఉన్నాయి. అవి EX30, EC40, XC60, XC90. ప్రతి మోడల్కు సంబంధించిన నిర్దిష్ట ధరల పెంపులను కంపెనీ వెల్లడించనప్పటికీ, అన్ని వేరియంట్ల ధరలను గరిష్టంగా రూ.1 లక్షకు పరిమితం చేయనున్నట్లు సమాచారం.
కొత్త ధరలు మే 1వ తేదీ నుంచి బుకింగ్లు, డెలివరీలకు వర్తిస్తాయి. అంటే అంతకు ముందు బుక్ చేసుకున్న లేదా కొనుగోలు చేసే కార్లకు పాత ధరలే వర్తిస్తాయి. కాగా వోల్వో కార్ ఇండియా దేశవ్యాప్తంగా 23 షోరూమ్లు మరియు 25 సర్వీస్ సెంటర్ల నెట్వర్క్ను నిర్వహిస్తోంది.


