వొడాఫోన్‌ ఐడియా నష్టాలు తగ్గాయ్‌ | Vodafone Idea loss narrows in Q2 | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌ ఐడియా నష్టాలు తగ్గాయ్‌

Nov 14 2024 12:46 PM | Updated on Nov 14 2024 12:58 PM

Vodafone Idea loss narrows in Q2

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. జులైలో టారిఫ్‌ల పెంపు చేపట్టడంతో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) మెరుగుపడటం ఇందుకు దోహదపడింది.

గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8,747 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,932 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 10,716 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఏఆర్‌పీయూ 8 శాతం పుంజుకుని రూ. 166ను తాకింది. మొత్తం వినియోగదారుల సంఖ్య 20.5 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: రూ.6కే అన్‌లిమిటెడ్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో బెస్ట్‌ ప్లాన్‌

కాగా.. మూడేళ్ల కాలంలో నెట్‌వర్క్‌ పరికరాల సరఫరా కోసం నోకియా, ఎరిక్‌సన్, శామ్‌సంగ్‌లతో 3.6 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 30,000 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. లితాల నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా షేరు బీఎస్‌ఈలో 4 శాతం క్షీణించి రూ. 7.37 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement