లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40గంటల సమయానికి సెన్సెక్స్ 120.37 పాయింట్ల లాభంతో 58367.46 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 42.85 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17422.85 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది.
ఓన్జీసీ,టైటాన్ కంపెనీ, ఎన్టీపీ, శ్రీ సిమెంట్,హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్,బీపీసీఎల్,హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.