శాంసంగ్ ఇండియా తాజాగా విజన్ ఏఐ టీవీ శ్రేణిని ఆవిష్కరించింది. 72 టీవీ మోడల్స్ను ప్రవేశపెట్టింది. వీటిలో మైక్రో ఆర్జీబీ, ఓఎల్ఈడీ, నియో క్యూఎల్ఈడీ, మినీ ఎల్ఈడీ మొదలైనవి ఉన్నాయి. శాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా ఉచిత కంటెంట్, కేర్ ప్లస్ ద్వారా అదనపు వారంటీ మొదలైనవి పొందవచ్చు.
పరిమిత కాలం పాటు నిర్దిష్ట టీవీ మోడల్స్పై కాంప్లిమెంటరీగా రూ. 1,02,990 విలువ చేసే సౌండ్బార్, రూ. 23,990 విలువ చేసే మ్యూజిక్ స్టూడియో ఉచితంగా లభిస్తాయని సంస్థ తెలిపింది. యూహెచ్డీ టీవీల శ్రేణి ధర రూ. 36,990 నుంచి, మైక్రో ఆర్జీబీ రేటు రూ. 1,24,990 నుంచి ప్రారంభమవుతుంది.


