
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం సాయంత్రం లాభాలతో ముగింపు పలికాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ పలు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావం దేశీయ సూచీలపై పడింది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 167 పాయింట్లు లాభపడి 71595 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల స్వల్ప లాభంతో 21782 వద్ద ముగించాయి.
ఇక గ్రాసిం, ఎస్బీఐ, అపోలో హాస్పటిల్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా, హీరోమోటో కార్ప్, అదానీ పోర్ట్స్, సిఫ్లా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగింపు పలకగా.. ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, హిందాల్కో, టాటా స్టీల్, హిందాల్కో, యూపీఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి.