New India Assurance Issues Policy for Drones - Sakshi
Sakshi News home page

న్యూ ఇండియా అష్యూరెన్స్‌ నుంచి డ్రోన్లకు బీమా..

Dec 24 2022 7:28 AM | Updated on Dec 24 2022 10:44 AM

New India Assurance Issues Policy For Drones - Sakshi

ముంబై: డ్రోన్లకు కూడా బీమా కవరేజీ అందించేలా న్యూ ఇండియా అష్యూరెన్స్‌ (ఎన్‌ఐఏ) కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. తద్వారా ఎన్‌ఐఏ ఈ తరహా పాలసీలను అందించే తొలి ప్రభుత్వ రంగ బీమా సంస్థగా నిల్చింది. పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌ల నుంచి సోలో ఫ్లయింగ్‌ గ్లైడర్లు మొదలైన వాటికి ఈ పథకం వర్తిస్తుంది.

డ్రోన్‌ ఓనర్లు, ఆపరేటర్లు, తయారీ సంస్థలకు కవరేజీ అందించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 15 యాడ్‌ ఆన్‌ కవర్స్‌ కూడా అందిస్తున్నట్లు పేర్కొంది.  ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా ఏఐజీ జనరల్‌ తదితర సంస్థలు డ్రోన్‌ పాలసీలను అందిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement