హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎంటార్ టెక్నాలజీస్ లాభం రూ. 50 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన సుమారు రూ. 11 కోట్లతో పోలిస్తే 365 శాతం మేర వృద్ధి చెందింది. ఆదాయం రూ. 157 కోట్ల నుంచి 130 శాతం వృద్ధి చెంది రూ. 361 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన గైడెన్స్కి అనుగుణంగా క్యూ1లో పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు కంపెనీ ఎండీ పర్వత్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
బీఎస్ఈలో ఎంటార్ టెక్నాలజీస్ షేరు 5% క్షీణించి రూ. 5,183 వద్ద ముగిసింది.


