ఘనంగా మైక్రోసాప్ట్‌ ఐడీసీ పినాకిల్‌ సమ్మిట్‌-2025 | Microsoft hosted Pinnacle Summit in Hyderabad | Sakshi
Sakshi News home page

ఘనంగా మైక్రోసాప్ట్‌ ఐడీసీ పినాకిల్‌ సమ్మిట్‌-2025

May 1 2025 12:15 PM | Updated on May 1 2025 1:57 PM

Microsoft hosted Pinnacle Summit in Hyderabad

సాక్షి,హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లో కృత్రిమ మేధ (ai) వినియోగంలో భారత్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్‌ బేస్డ్‌ టెక్‌ కంపెనీ గిట్‌ హబ్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం 1.7కోట్లకు పైగా డెవలప్‌ ఉన్న భారత్‌ 2028 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అవతరిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈ దిశగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC) అడ్వాన్స్‌డ్‌ ఏఐపై దృష్టిసారిస్తూ మూడవ పినాకిల్ సమ్మిట్- 2025ను నిర్వహించింది. ‘అన్‌లాక్‌ ది ఎజెంటిక్‌ ఫ్యూచర్‌ - వేర్‌ ఏఐ ఏజెంట్‌ మీట్‌ హ్యూమన్‌ ఇంజెన్యూయిటీ’ అనే థీమ్‌ కొనసాగిన ఈ టెక్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఐడీసీ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కుమార్‌, కోర్‌ ఏఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయ్ పారిక్,మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్‌ పునీత్ చంద్రోక్‌లు భారత్‌లో ఏఐ విస్తరణ, మైక్రోసాఫ్ట్ ఏఐ ఈకో సిస్టమ్‌ వంటి అంశాపై చర్చించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement