యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు! | Comprehensive Modular Survey Telecom 2025 conducted by Ministry of Stats | Sakshi
Sakshi News home page

యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!

May 30 2025 8:41 AM | Updated on May 30 2025 8:41 AM

Comprehensive Modular Survey Telecom 2025 conducted by Ministry of Stats

యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా 15–29 ఏళ్ల వయసులో ఉన్న అందరూ మొబైల్‌ ఫోన్‌ సాయంతో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించగలరని టెలికం సర్వేలో తెలిసింది. తాము యూపీఐ ద్వారా బ్యాంక్‌ లావాదేవీలు నిర్వహించగలమని 99.5 శాతం మంది చెప్పినట్టు ‘కాంప్రహెన్సివ్‌ మాడ్యులర్‌ సర్వే: టెలికం, 2025’ వెల్లడించింది. కేంద్ర గణాంకాల శాఖ ఈ నివేదికను విడుదల చేసింది.

15–29 ఏళ్లలో 97.1 శాతం మంది గత మూడు నెలలుగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 96.8 శాతం మంది (15–29 ఏళ్లు) గత మూడు నెలల్లో కనీసం ఒకసారి మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేసినట్టు తెలిపారు. పట్టణాల్లో ఈ వయసులోని వారిలో 97.6 శాతం మంది ఫోన్‌ను వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే వయసులోని వారిలో 95.5 శాతం మందికి స్మార్ట్‌ఫోన్‌ ఉంది. దేశంలోని 85.5 శాతం గృహాల్లో కనీసం ఒక స్మార్ట్‌ఫోన్‌ ఉంది.

ఇదీ చదవండి: మార్చి త్రైమాసిక ఫలితాలు

ఇదిలాఉండగా, దేశంలో జరిగే డిజిటల్‌ లావాదేవీల్లో అత్యధికం యూపీఐ (UPI) ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి అనేక యూపీఐ యాప్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో లోపాల ద్వారా వినియోగదారులు డబ్బులు పోగుట్టుకుంటున్న సంఘటనలూ అక్కడక్కడా జరగుతున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు త్వరలో రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement