ఫ్యాక్ట్‌ చెక్‌ : ఆధార్‌ కార్డు ఉంటే కేంద్రం రూ.5 లక్షలు రుణం ఇస్తుందా? | Central Government Providing Loan Of Rs 4.78 Lakh To All Aadhaar Card Holders | Sakshi
Sakshi News home page

ఫ్యాక్ట్‌ చెక్‌ : ఆధార్‌ కార్డు ఉంటే కేంద్రం రూ.5 లక్షలు రుణం ఇస్తుందా?

Nov 20 2022 10:01 PM | Updated on Nov 20 2022 10:02 PM

Central Government Providing Loan Of Rs 4.78 Lakh To All Aadhaar Card Holders - Sakshi

ఆధార్‌ కార్డు ఉంటే చాలు కేంద్ర ప్రభుత్వం దాదాపూ రూ. 5లక్షల వరకు రుణం ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ కేంద్రం ఈ పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తుందా? అందులో నిజా నిజాలేంటో తెలుసుకుందాం.  

ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్‌ కార్డు నుంచి బ్యాంక్‌ ఖాతాల వరకు ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. ఆధార్‌ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డు వినియోగదారులకు కేంద్రం  రూ. 4 లక్షల 78 వేల రుణం అందనుందనే ప్రచారం జరుగుతోంది.  

ఈ ప్రచారాన్ని కేంద్రానికి చెందిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) కొట్టిపారేసింది. ఈ తరహాలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పధకాల్ని అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌లో ఆధార్ కార్డు రుణం వ్యవహారమంతా ఫేక్ అని తేలింది. ఆధార్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement