యంత్ర సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

యంత్ర సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలి

Oct 19 2025 6:51 AM | Updated on Oct 19 2025 6:51 AM

యంత్ర సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలి

యంత్ర సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలి

మణుగూరు టౌన్‌: బొగ్గు, ఓబీ వెలికితీతలో యంత్రాల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) తిరుమలరావు అన్నారు. శనివారం మణుగూరులో పర్యటించిన ఆయన ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌తో కలిసి పీకేఓసీ–2, 4 గనులను వ్యూ పాయింట్‌ నుంచి బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీహెచ్‌పీ వరకు బెల్ట్‌ కన్వేయర్‌ సిస్టం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్‌, శ్రీనివాసచారి, వెంకట రామారావు, వీరభద్రరావు, శ్రీనివాస్‌, రమేశ్‌, వీరభద్రుడు, మధన్‌నాయక్‌, బైరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

సింగరేణి డైరెక్టర్‌ తిరుమలరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement