ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌

Oct 17 2025 6:32 AM | Updated on Oct 17 2025 6:32 AM

ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌

ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్‌

పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాసగిరి వేంటేశ్వరస్వామి ఆలయంలో హుండీలోని నగదు చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల కథనం మేరకు.. గత మంగళవారం రాత్రి శ్రీనివాసకాలనీలోని గుట్టపై గల వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశంచి, హుండీ తాళాలు పగులగొట్టి సుమారు రూ.3 వేల నగదును చోరీ చేశాడు. అక్కడ పనిచేసే వ్యక్తులకు చెందిన రెండు సెల్‌ఫోన్‌లు, పర్సులోని రూ.1,500 నగదునూ అపహరించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కావడంతో గురువారం కిన్నెరసానిరోడ్‌లో గుడ్‌మార్నింగ్‌ హోటల్‌ వద్ద సదరు వ్యక్తిని గుర్తించిన గుడి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలో అదే దొంగ ఆలయంలో పలుమార్లు చోరీకి పాల్పడినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement