అండర్‌–19 వాలీబాల్‌, | - | Sakshi
Sakshi News home page

అండర్‌–19 వాలీబాల్‌,

Oct 12 2025 6:43 AM | Updated on Oct 12 2025 6:43 AM

అండర్

అండర్‌–19 వాలీబాల్‌,

హ్యాండ్‌బాల్‌ జట్ల ఎంపిక

ఖమ్మంస్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్‌ కళాశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌ బాలబాలికల జట్లను ఎంపికచేశారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో శనివారం నిర్వహించిన ఎంపిక పోటీలకు 170 మంది వాలీబాల్‌క్రీడాకారులు, వంద మంది హ్యాండ్‌బాల్‌ క్రీడా కారులు హాజరయ్యారు. ఇక్కడ ఎంపిక చేసిన జట్లు హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని జిల్లాక్రీడల సంఘం కార్యదర్శి ఎండీ మూసాకలీం తెలిపారు. వాలీబాల్‌ జిల్లా బాలుర జట్టుకు జి.అక్షయ్‌కుమార్‌, ఎ.గోపినాథ్‌, వి.నా యుడు, ఈ.అనిల్‌కుమార్‌, ఎస్‌.శివకోటి, పి.విష్ణువర్దన్‌, బి.కల్యాణ్‌ప్రసాద్‌, ఎన్‌.శ్రీహాస్‌, టి.వినయ్‌, ఎం.శ్యామ్‌, ఎండీ అస్లాం, పి. వంశీ, టి.శ్రీరాం, రవికుమార్‌, జోషినాథ్‌, రోహిత్‌, బాలికల జట్టుకు బి.అంబిక, ఎం.నక్షత్ర, కె.ప్రసన్నకుమారి, జి.నవ్యశ్రీ, ఎ.కీర్తన, విద్యశ్రీ, బి.తనూజ, ఆర్‌.శ్రావణి, డి.పుష్పలత, అతియా ఫాతిమా, ఎస్‌.ఉమాలత, వి.బేబికల్యాణి, అస్మిత ఎంపికయ్యారని పేర్కొన్నా రు. హ్యాండ్‌బాల్‌ బాలుర జట్టులో విగ్‌నాగ్‌పక్‌, తి యామాత్‌, కె.వేణు, ఎస్‌కే ఇమ్రాన్‌, ఎం. యశ్వంత్‌, ఎస్‌కే జకీరుల్లా, జె.గౌతమ్‌, ఎం.హర్షిత్‌, జె.రాంచరణ్‌, వి.పవన్‌, జి.లాల్‌కృష్ణ, ఐ.కార్తీక్‌, ఎండీ అబ్దుల్లా, సీహెచ్‌ కార్తీక్‌రెడ్డి, ఎం.జనార్దన్‌, సంతోష్‌కుమార్‌, కె.వంశీ, ఎన్‌.కార్తీక్‌ ఎంపికయ్యా రని తెలిపారు. అలాగే, బాలికల జట్టులో ఉషాశ్రీనేహా, టి. భవాని, పి.సింధు, వి.సంధ్య, జె.సౌమ్య, సాబా తబాస్సుమ్‌,డి.భారతి, కె.సాత్విక, కె.హర్షిణి, సీహెచ్‌.మాధురి, జె.జ్యోత్స్న, అక్షర, బి. రిషి త, ఎన్‌.అక్షర, బి.కార్తీకరెడ్డికి స్థానం దక్కిందని వెల్లడించారు.

●జిల్లా పాఠఽశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన జిల్లా అండర్‌–14 బాలబాలికల కబడ్డీ జట్లను శనివారం ఖమ్మంలో ఎంపిక చేశారు. ఈ పోటీలకు 107 మంది బాలురు, 70 మంది బాలికలు హాజరుకాగా జిల్లా జట్లను సంఘం కార్యదర్శి వై.రామారావు ప్రకటించారు. బాలుర జట్టుకు బి.హర్ష, పి.సంతోష్‌, ఎ.మనోజ్‌, కె.యశ్వంత్‌, ఎ.యశ్వంత్‌, ఆర్‌.జేమ్స్‌, బి.అరుణ్‌, బి.వెంకటేశ్‌, ఎల్‌.కౌశిక్‌, బి.సరిరాం, కె.నాగర్జున, బి.అంజిబాబు, ఎస్‌. గోపి, కె.అక్షయ్‌కృష్ణ, పి.బాబు, బాలికల జట్టుకు నాగస్వర్చిత, ఎం.శ్రీజ, కెభవ్యశ్రీ,, కె.ఫరిదా, బి.అనూ, కె.భవాని, జి.సృజన, ఎస్‌కే సమీనా, డి.దేవిశ్రీ, వి.మోక్షితకృష్ణ, ఎల్‌.స్పందన, జి.అంకిత ఎంపికయ్యారని తెలిపారు.

కల్లూరు: ఉమ్మడి జిల్లా ఖో–ఖో బాలబాలికల జట్లను కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఎంపిక చేశారు. అండర్‌–19 విభాగంలో జట్ల ఎంపికకు నిర్వహించిన పోటీలకు బాలురు 130 మంది, బాలికలు 90 హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేశామని నిర్వహణ కార్యదర్శి బోడా బీమా, పసుపులేటి వీరరాఘవయ్య, మూసా ఖలీమ్‌ తెలిపారు. పోటీలను పీఈటీలు, కోచ్‌లు ఎస్‌.రామారావు, పి.పవన్‌కుమార్‌, ఎ.కృష్ణ, ప్రసాద్‌, సైదులు, సమ్మయ్య, కై సర్‌ పద్మావతి, స్టేడియం ఇన్‌చార్జ్‌ గౌతమ్‌రెడ్డి, నాగబాబు, మామిడాల వెంకటేశ్వరరావు, గోపాల్‌రావు పర్యవేక్షిచారు.

అండర్‌–19 వాలీబాల్‌, 1
1/1

అండర్‌–19 వాలీబాల్‌,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement