ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు | - | Sakshi
Sakshi News home page

ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు

Sep 19 2025 2:19 AM | Updated on Sep 19 2025 2:19 AM

ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు

ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు

కొత్తగూడెంటౌన్‌: ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గురువారం జిల్లా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజు, సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌ అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పామేడుకు చెందిన మడకం దేవా (ఏసీఎం ఏరియా కమిటీ సౌత్‌ బస్తర్‌), పార్టీ మెంబర్‌ మడవి జోగా, మిలీషియా సభ్యులు, పోడియం దేవా, మడకం ఇడుమ, మడకం ముకా, మడవి ఐతా లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులకు ఒక్కొక్కరికి తక్షణసాయం కింద రూ.25 వేల చొప్పున నగదు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తామని ఎస్పీ రోహిత్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement