
‘రాజీవ్ యువ వికాసం’తో జీవనోపాధి
ఐటీడీఏ పీఓ రాహుల్
బూర్గంపాడు/భద్రాచలంటౌన్: రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగ యువత జీవనోపాధులు మెరుగుపడతాయని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. శుక్రవారం ఆయన సారపాక గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను పరిశీలించారు. గ్రామపంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. అనంతరం భద్రాచలంలోని సుందరయ్య నగర్ డీఆర్సీసీ పక్కన ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత సుందరయ్య నగర్లో ఇందిరమ్మ కాలనీని సందర్శించారు. స్థలం ఉన్న లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన నిర్మించుకోవాలన్నారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఆదివాసీ మహనీయుల విగ్రహాల మరమ్మతులపై ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ హరీష్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నరసింహారావు, ఏఈ శివ, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్, సిబ్బంది రాములు, ఠాగూర్, ప్రశాంతి, మురళి పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

‘రాజీవ్ యువ వికాసం’తో జీవనోపాధి