సెల్‌ టవర్‌ నిర్మాణం నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

సెల్‌ టవర్‌ నిర్మాణం నిలిపివేయాలి

Mar 18 2025 12:43 AM | Updated on Mar 18 2025 12:41 AM

మణుగూరు టౌన్‌: మున్సిపాలిటీలోని పీకే–1 ఇంక్‌లైన్‌ ఏరియాలో నిర్మిస్తున్న సెల్‌ టవర్‌ను నిలిపివేయాలని స్థానికులు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికే బీటీపీఎస్‌, సింగరేణి, సోలార్‌ ప్లాంట్‌, హెచ్‌డబ్ల్యూపీ(ఎం) పరిశ్రమల కారణంగా అధిక కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని, దీనికితోడు సెల్‌ టవర్‌ నిర్మిస్తే రేడియేషన్‌ ప్రభావంతో అనారోగ్యం పాలవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం సీసా చట్టం, గిరిజన హక్కులకు వ్యతిరేకంగా జరుగుతోందని ఆరోపించారు.

రాష్ట్ర మానవ హక్కుల

కమిషన్‌కు వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement