బూర్గంపాడు/టేకులపల్లి: బూర్గంపాడు మండలం సారపాకలోని శ్రీదాసాంజనేయ స్వామి ఆలయం, గాంధీనగర్ శ్రీకృష్ణమందిరంలో భక్తులు భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటితో తలంబ్రాలు వలిచారు. శుక్రవారం కాలినడకగా భద్రాచలం వెళ్లి రామాలయంలో తలంబ్రాలు సమర్పించారు. అలాగే, టేకులపల్లి నుంచి గోటితలంబ్రాలతో భద్రాచలానికి భక్తులు బయలుదేరారు. తొలుత టేకులపల్లి శ్రీకోదండ రామాలయంలో గుడిపూడి సబిత ఆధ్వర్యాన పూజలు చేయగా, ఆమెడ రమాదేవి, కేసా పద్మజ, ఆమెడ రేణుక, తుమ్మల సరిత, నెల్లూరి కస్తూరి, జాలాది కవిత, తోటకూరి స్వరూప, అనంతుల వసంత, వెంకటలక్ష్మి, రమ, రాయల ఇందిర, గుర్రం సుజన్య, ఎం.బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.